'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్ను విడుదల చేసిన కేటీఆర్
- November 11, 2016
త్వరలో హైదరాబాద్లో నిర్మించబోయే 'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న నాస్కామ్ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ నమూనాను ఆవిష్కరించారు. సరికొత్త, అత్యాధునిక డిజైన్లో ఈ టవర్లను నిర్మించడానికి తలపెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ ఇన్న మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని కేటీఆర్ ఒక ట్వీట్లో వివరించారు. నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటు.. పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ ఈ నిర్మాణం కనిపిస్తోంది. టవర్ల మధ్యభాగంలో కూడా పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు సైతం మోడల్లో కనిపిస్తున్నాయి.
కింది భాగంలో రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా డిజైన్లో భాగంగా ఉన్నాయి. ప్రధానంగా మల్టీమీడియా, గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







