ఎస్వైఎల్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
- November 11, 2016
పంజాబ్లో సట్లెజ్ యమునా లింక్(ఎస్వైఎల్) వివాదంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఎస్వైఎల్ కెనాల్ వినియోగంపై సుప్రీంకోర్టు హరియాణాకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పంజాబ్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేందరూ రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేత చంద్రజీత్ సింగ్తో సహా 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు స్పీకర్కు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేల వెంట సీనియర్ నేతలు అమరీందర్ సింగ్, అంబికా సోనీ, ప్రతాప్ సింగ్ బజ్వా తదితరులు ఉన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై విమర్శలు చేశారు. ప్రజల ఆసక్తులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా అంగీకరించలేదు. అమరీందర్ ఇప్పటికే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పంజాబ్ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన 'పంజాబ్ టర్మినేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్' చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. హరియాణా, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, దిల్లీ, చండీగఢ్లకు నీటి పంపకం విషయంలో పంజాబ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







