బంగారం షాపులకు నోటీసులు జారీ

- November 11, 2016 , by Maagulf
బంగారం షాపులకు నోటీసులు జారీ

ప్రధాని పెద్ద నోట్ల రద్దు తర్వాత అంటే 8 వ తేదీ రాత్రి 8 తర్వాత మీరు బంగారం కొన్నారా...? అదీ రశీదు లేకుండా బంగారం కొన్నారా..? ఐతే కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్లే... అది ఎలాగంటే...
ప్రధాని ప్రకటన తర్వాత 8 వ తేదీ అర్ధరాత్రి వరకూ దేశంలో చాలా చోట్ల బంగారం దుకాణాలు తెరచే ఉన్నాయి అనే విషయం ప్రధాని దృష్టికి వచ్చింది. ఆ సమయంలో కొంత మంది బడాబాబులు రూ.500, రూ. 1000 నోట్లు రద్దు కావడంతో కొందరు రశీదు లేకుండా అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేసినట్లు కేంద్రానికి సమాచారం అందింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బంగారం షాపు యజమానులకు నోటీసులు జారీ చేసింది. గోల్డ్ షాపుల్లోని సీసీ ఫుటేజ్ లను వెంటనే సబ్మిట్ చేయాల్సిందిగా షాపు యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫుటేజ్ ద్వారా 8 తర్వాత ఒక కుటుంబంలోని వ్యక్తులు ఎన్నిసార్లు షాపింగ్ చేశారు.. ఒకే వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశారు అనేది తెసుకొంటారు అని సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com