జపాన్ తో భారత్ అణు ఒప్పందం.!
- November 11, 2016
ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం కుదిరింది. అనంతరం మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్తో పౌర అణు ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. జపాన్తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్ అని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వామ్య దేశాలని మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమలక్ష్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









