కార్మిక హక్కుల్లో రాజీపడేది లేదు: సౌదీ అరేబియా
- November 11, 2016
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, కార్మికుల రక్షణ, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో రాజీపడబోదని సౌదీ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగాల పేరుతో అభాగ్యుల్ని బానిసలుగా మార్చేందుకు సౌదీ వేదికగా మారుతోందన్న ఆరోపణల్ని ఎంబసీ ఖండించింది. అలాంటి చర్యలు ఏమైనా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది. కార్మికుల కోసం చట్టాల్లో చాలా మార్పులు తెచ్చినట్లు తెలిపిన ఎంబసీ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించింది. మనుషుల ఆక్రమ రవాణా విషయంలో ప్రపంచంలోనే అత్యంత కఠినంగా తాము వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, భారత ప్రభుత్వం అక్రమంగా విదేశాలకు వెళుతున్నవారిపై తీసుకుంటున్న కఠిన చర్యల్ని సౌదీ ప్రభుత్వం కొనియాడింది. సౌదీలో సుమారు 3 మిలియన్ల మంది ఇండియన్లు ఉన్నారనీ, అందులో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటి ఎక్స్పర్ట్లు ఉఉండటం గొప్ప విషయమని సౌదీ ఎంబసీ తెలిపింది. ఇరు దేశాల మధ్యా సన్నిహితసంబంధాలు ఉన్నాయనీ, రానున్న కాలంలో ఈ బంధం ఇంకా ధృడమవుతుందని సౌందీ ఎంబసీ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







