కార్మిక హక్కుల్లో రాజీపడేది లేదు: సౌదీ అరేబియా
- November 11, 2016
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, కార్మికుల రక్షణ, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో రాజీపడబోదని సౌదీ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగాల పేరుతో అభాగ్యుల్ని బానిసలుగా మార్చేందుకు సౌదీ వేదికగా మారుతోందన్న ఆరోపణల్ని ఎంబసీ ఖండించింది. అలాంటి చర్యలు ఏమైనా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది. కార్మికుల కోసం చట్టాల్లో చాలా మార్పులు తెచ్చినట్లు తెలిపిన ఎంబసీ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించింది. మనుషుల ఆక్రమ రవాణా విషయంలో ప్రపంచంలోనే అత్యంత కఠినంగా తాము వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, భారత ప్రభుత్వం అక్రమంగా విదేశాలకు వెళుతున్నవారిపై తీసుకుంటున్న కఠిన చర్యల్ని సౌదీ ప్రభుత్వం కొనియాడింది. సౌదీలో సుమారు 3 మిలియన్ల మంది ఇండియన్లు ఉన్నారనీ, అందులో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటి ఎక్స్పర్ట్లు ఉఉండటం గొప్ప విషయమని సౌదీ ఎంబసీ తెలిపింది. ఇరు దేశాల మధ్యా సన్నిహితసంబంధాలు ఉన్నాయనీ, రానున్న కాలంలో ఈ బంధం ఇంకా ధృడమవుతుందని సౌందీ ఎంబసీ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









