అమెరికా ఆర్మీ స్థావరంపై దాడి, నలుగురు అమెరికన్లు మృతి

- November 12, 2016 , by Maagulf
అమెరికా ఆర్మీ స్థావరంపై దాడి, నలుగురు అమెరికన్లు మృతి

అఫ్గానిస్తాన్‌లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు అమెరికన్లు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ వెల్లడించారు. భారీ భద్రత నడుమ ఉండే 'బగ్రం ఎరుుర్‌ఫీల్డ్'లో జరిగిన ఈ దాడిలో ఒక పోలాండ్, మరో 16 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని తాలిబాన్‌లు ప్రకటించారు. చనిపోరుున నలుగురిలో అమెరికాకు చెందిన ఇద్దరు సైనికులు, ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తి స్థావరంలో పనిచేసే అఫ్గాన్ పౌరుడు అయ్యుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ స్థావరానికి వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థ ఉంటుంది. అఫ్గాన్, అమెరికా సైనికులు నిత్యం సెక్యూరిటీ కెమెరాలతోనూ, స్తంభాలపైకి ఎక్కి ఇక్కడ పహారా కాస్తుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com