విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల పై తాజా నిర్ణయం
- November 14, 2016
పెద్దనోట్ల రద్దుతో దేశంలో నగదు కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో పాత నోట్లను అంగీకరించే గడువును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది. అదేవిధంగా విమానాశ్రయాల్లోనూ పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21 అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న ఉద్దేశంతో పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21వరకు కొనసాగిస్తున్నట్టు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పాతనోట్లను అన్నీ రైల్వేస్టేషన్లలో యథాతథంగా అంగీకరిస్తామని, అదేవిధంగా ప్రయాణసమయంలో క్యాటరింగ్ సేవలకు కూడా పాతనోట్లను వినియోగించవచ్చునని రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఇక అన్నీ జాతీయ రహదారులపైనా టోల్ రుసుమును ఈ నెల 24వరకు రద్దుచేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









