మయన్మార్లో 25 మంది ఊచకోత
- November 14, 2016
మయన్మార్లోని రఖయిన్ రాష్ట్రంలో రొహింగ్య ముస్లింల ఊచకోతలు ఆగడంలేదు. 25 మంది రొహింగ్య ముస్లింలను ఆదివారం హతమార్చినట్టు మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. గొడ్డళ్లు, లాఠీలు కలిగి ఉన్నందు వల్లే వారిని చంపినట్టు తెలిపింది. కాగా, సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోల ద్వారా హతమైనవారిలో చిన్నపిల్లలు, మహిళలూ ఉన్నట్టుగా తెలుస్తోంది. రఖయిన్ రాష్ట్రం లో స్వతంత్రంగా పనిచేస్తున్న మీడియా సంస్థ ఏదీ లేదు. దీంతో ఆర్మీ అధికారులు చెప్పిందే వేదం. రొహింగ్య ప్రజలు గొడ్డళ్లు, లాఠీలతో దాడులు చేశారని, ఉద్రిక్తతలు పెంచేందుకు తమ ఇళ్లకు తామే నిప్పుపెట్టుకున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, ఆర్మీ అధికారులు చెప్పిన దానికి, రొహింగ్య సామాజిక మాధ్యమాలు చెప్పేదానికి పొంతన లేదు.మృతు సంఖ్య వస్తవానికి చాచా ఎక్కువే ఉంటుందని అవి పేర్కొన్నాయి. రఖయిన్లో ఆర్మీ ప్రభుత్వం కనుసన్నల్లో కాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మర్ నేత అంగ్ సాంగ్ సూకీ మౌనం వహిస్తున్నారు. చాలా రోజులుగా రొహింగ్య గ్రామాలపై హెలికాప్టర్ గన్షిప్లతో ఆర్మీ దాడులు చేస్తోంది.
వందలాది రొహింగ్య ముస్లింలు గ్రామాలను విడిచి వెళ్లేలా బలవంతం చేస్తోంది. దేశంలో పది లక్షల మంది రొహింగ్య ముస్లింలు ఉన్నారు. వీరిని మయన్మార్ ప్రభుత్వం దేశ పౌరులుగా గుర్తించడం లేదు. 2012లో అప్పటి మిలటరీ ప్రభుత్వం, బౌద్ధసన్యాలు కలిసి రొహింగ్య ముస్లింలను ఊచకోత కోసారు.
వారి గ్రామాలను దహనం చేశారు, మహిళలను, పిల్లలను అపహరించారు. దీంతో, వేలాది మంది రొహింగ్యాలు దేశం విడిచి ఇతర దేశాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







