మయన్మార్లో 25 మంది ఊచకోత
- November 14, 2016
మయన్మార్లోని రఖయిన్ రాష్ట్రంలో రొహింగ్య ముస్లింల ఊచకోతలు ఆగడంలేదు. 25 మంది రొహింగ్య ముస్లింలను ఆదివారం హతమార్చినట్టు మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. గొడ్డళ్లు, లాఠీలు కలిగి ఉన్నందు వల్లే వారిని చంపినట్టు తెలిపింది. కాగా, సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోల ద్వారా హతమైనవారిలో చిన్నపిల్లలు, మహిళలూ ఉన్నట్టుగా తెలుస్తోంది. రఖయిన్ రాష్ట్రం లో స్వతంత్రంగా పనిచేస్తున్న మీడియా సంస్థ ఏదీ లేదు. దీంతో ఆర్మీ అధికారులు చెప్పిందే వేదం. రొహింగ్య ప్రజలు గొడ్డళ్లు, లాఠీలతో దాడులు చేశారని, ఉద్రిక్తతలు పెంచేందుకు తమ ఇళ్లకు తామే నిప్పుపెట్టుకున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, ఆర్మీ అధికారులు చెప్పిన దానికి, రొహింగ్య సామాజిక మాధ్యమాలు చెప్పేదానికి పొంతన లేదు.మృతు సంఖ్య వస్తవానికి చాచా ఎక్కువే ఉంటుందని అవి పేర్కొన్నాయి. రఖయిన్లో ఆర్మీ ప్రభుత్వం కనుసన్నల్లో కాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మర్ నేత అంగ్ సాంగ్ సూకీ మౌనం వహిస్తున్నారు. చాలా రోజులుగా రొహింగ్య గ్రామాలపై హెలికాప్టర్ గన్షిప్లతో ఆర్మీ దాడులు చేస్తోంది.
వందలాది రొహింగ్య ముస్లింలు గ్రామాలను విడిచి వెళ్లేలా బలవంతం చేస్తోంది. దేశంలో పది లక్షల మంది రొహింగ్య ముస్లింలు ఉన్నారు. వీరిని మయన్మార్ ప్రభుత్వం దేశ పౌరులుగా గుర్తించడం లేదు. 2012లో అప్పటి మిలటరీ ప్రభుత్వం, బౌద్ధసన్యాలు కలిసి రొహింగ్య ముస్లింలను ఊచకోత కోసారు.
వారి గ్రామాలను దహనం చేశారు, మహిళలను, పిల్లలను అపహరించారు. దీంతో, వేలాది మంది రొహింగ్యాలు దేశం విడిచి ఇతర దేశాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









