విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల పై తాజా నిర్ణయం
- November 14, 2016
పెద్దనోట్ల రద్దుతో దేశంలో నగదు కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో పాత నోట్లను అంగీకరించే గడువును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది. అదేవిధంగా విమానాశ్రయాల్లోనూ పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21 అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న ఉద్దేశంతో పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21వరకు కొనసాగిస్తున్నట్టు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పాతనోట్లను అన్నీ రైల్వేస్టేషన్లలో యథాతథంగా అంగీకరిస్తామని, అదేవిధంగా ప్రయాణసమయంలో క్యాటరింగ్ సేవలకు కూడా పాతనోట్లను వినియోగించవచ్చునని రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఇక అన్నీ జాతీయ రహదారులపైనా టోల్ రుసుమును ఈ నెల 24వరకు రద్దుచేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









