రెడ్‌ సీ అడుగున సుల్తాన్‌ కబూస్‌ చిత్రపట ఆవిష్కరణ

- November 16, 2016 , by Maagulf
రెడ్‌ సీ అడుగున సుల్తాన్‌ కబూస్‌ చిత్రపట ఆవిష్కరణ
ఒమన్‌ 46వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా అల్‌ గైలాని మరియు టీమ్‌ సౌదీ అరేబియా తీరంలో రెడ్‌ సీ అడుగున సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌ చిత్రపటాన్ని అలాగే ఒమన్‌ జాతీయ పతాకాన్నీ ఆవిష్కరించారు. మెరిటైమ్‌ హెరిటేజ్‌ని సంరక్షించడంలో భాగంగా తాము ఈ ఫీట్‌ నిర్వహించినట్లు ఒమర్‌ అబ్దుల్లా అల్‌ గైలాని చెప్పారు. ఈ ఫీట్‌ ద్వారా సుల్తానేట్‌లో డైవింగ్‌ పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నామనీ, ఈ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే తన లక్ష్యం నెరవేరుతుందనే ఆశాభావంతో ఉన్నామని అన్నారాయన. 20 డైవింగ్‌ అటెంప్ట్స్‌ తర్వాత సీ బెడ్‌కి చేరుకున్నామని, ఫొటోగ్రాఫ్‌ మరియు ఫ్లాగ్‌ కోసం 1,600 ఒమన్‌ రియాల్స్‌ ఖర్చయ్యిందని తెలిపారు. 2012లో ఈ గ్రూప్‌ని ఏర్పాటు చేశామని అన్నారు ఒమర్‌ అబ్దుల్లా. గత ఏడాది ఒమర్‌ అబ్దుల్లా టీమ్‌ ఈజిప్టియన్‌ సిటీ షార్మ్‌ ఎల్‌ షేక్‌లోని దహాబ్‌ ప్రాంతంలో ఒమనీ ఫ్లాగ్‌ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం ఓ దేశాన్ని ఎంచుకుని, సముద్రంలోకి వెళ్ళి నేషనల్‌ డేని సెలబ్రేట్‌ చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com