త్వరలో ఫేస్బుక్ లోను పెట్టనున్న ఆన్లైన్ అమ్మకాలు
- August 29, 2015
ఇప్పటి వరకు చాటింగ్, ఉచిత కాల్స్కే పరిమితమైన ఫేస్బుక్..తర్వలోనే మరో కొత్త సేవను అందుబాటులో తేనుంది. ఆన్లైన్లో వస్తువులు కొనేలా ఒక కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఫేస్బుక్ మెసేంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ గురువారం వెల్లడించారు. ఈ సర్వీసుకు 'ఎం' అని నామకరణం చేశామని తెలిపారు. 'ఫేస్బుక్ మేసేంజర్లో 'ఎం' సేవలు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. మీ ప్రియమైన వారికి బహుమతులు కొనుగోలు చేయడానికి మా వంతు సాయం అందిస్తాం. రెస్టారెంట్స్లో టేబుల్ బుకింగ్, ప్రయాణాలకు ముందుగానే టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎం ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం' అని డేవిడ్ తెలిపారు. ఫేస్బుక్ మెసేంజర్ను ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







