నలుగురిలో ముగ్గురు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడేవారే
- November 16, 2016
అబుదాబీ: వాహనాలు నడిపే ప్రతి నలుగురిలో ముగ్గురు ఏదో ఒక రకంగా వాహనాన్ని నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ని ఉపయోగించేవారని ఓ సర్వే వెల్లడించింది. 1033 మోటరిస్టుల్లో 26 శాతం మంది మాత్రమే వాహనం నడుపుతున్న సమయంలో ఫోన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడంలేదని చెప్పారు. అయితే వాహనాలు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం చట్టరీత్యా నేరమని అబుదాబీ పోలీసులు చెబుతున్నారు. 200 దిర్హామ్ల ఫైన్తోపాటుగా 4 బ్లాక్ పాయింట్స్ ఈ నేరానికిగాను విధిస్తారు. రోడ్లపై ఈ తరహా నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించడం ఛాలెంజింగ్గా మారుతోందని, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల ఆలోచనల్లో మార్పులు రావడంలేదని అబుదాబీట్రాఫిక్ పోలీస్ కల్నల్ జమాల్ అల్ అమెరి చెప్పారు. ఇదొక బ్యాడ్ హ్యాబిట్ అనీ, సేఫ్ జర్నీ కోసమే ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారనీ, వాహనదారులు పోలీసులతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్లు వంటి వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డివైజెస్ ఉండటంతో 75 శాతం మంది వాటిని వినియోగిస్తున్నారు. అది కూడా ప్రమాదకరమేనని పోలీసులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









