బహ్రెయిన్లో ఎల్ఐసి ఇంటర్నేషనల్ దూకుడు
- November 18, 2016
ఎల్ఐసి ఇంటర్నేషనల్, వార్షిక టార్గెట్లో మంచి పెరుగుదలను చవిచూసినట్లు వెల్లడించింది. నాన్ సింగిల్ ప్రీమియమ్లో 112 శాతం, సింగిల్ ప్రీమియమ్లో 105 శాతం, టోటల్ ఫస్ట్ ప్రీమియమ్ ఇంకమ్లో 105 శాతం టార్గెట్ని చేరుకున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. 31 అక్టోబర్ 2016 నాటి గణాంకాల్ని సంస్థ వివరించింది. నంబర్ ఆఫ్ పాలసీస్ టార్గెట్ణఇ కూడా అనుకున్నదానికన్నా ముందే చేరుకున్నట్లు తెలిపారు సంస్థ ప్రతినిథులు. ఎల్ఐసి ఇంటర్నేషనల& బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ హోటల్ మోవెన్పింక్లో జరిగింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఛైర్మన్ వికె శర్మ, ఇంటర్కోల్ డైరెక్టర్ అబ్దుల్ రహ్మాన్ అలి అజ్వాన్, ఎల్ఐసి ఇంటర్నేషనల్ బహ్రెయిన్ సిఇఓ మరియు ఎండి రాజేష్ కండ్వాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎ.ఎం.బెస్ట్, తమ సంస్థకు బి ప్లస్ ప్లస్ (గుడ్) రేటింగ్ని గత ఏడాదిలానే ఇచ్చిందని సంస్థ వెల్లడించింది. వివిధ యూనిట్లకు చెందిన 10 మంది కన్సల్టెంట్లను ఈ సందర్బంగా వికె శర్మ ఘనంగా సత్కరించారు. కెకె ప్రవీణ్ - దుబాయ్ (బహ్రెయిన్), సందేష్ కిట్లెకర్, అనంతరామన్, టివి ప్రేమ్కుమార్ హారిస్, మోఫిజుద్దిన్ ఖాన్, కిరణ్ జైన్, బైజు బాలన్ (దుబాయ్), ఆర్.శ్రీనివాసరావు, కెసి సురేంద్రన్ (ఖతార్) తదితరులు సన్మానం పొందినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







