మవా కచోరీ
- November 18, 2016
కావలసిన పదార్థాలు: మైదా పిండి- ఒక కప్పు, నెయ్యి- రెండు టేబుల్స్పూన్లు, గోరు వెచ్చని నీళ్లు- ఒక కప్పు, మీగడ- అరకప్పు, పాల పొడి- ఒక కప్పు, బాదం, పిస్తా పలుకులు- పావు కప్పు, యాలకల పొడి- అర టీస్పూను, చక్కెర- ఒకటిన్నరకప్పు, కుంకుమ పువ్వు- చిటికెడు.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, నెయ్యి వేసి నీళ్లు పోస్తూ మెత్తగా కలిపి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో ఒక కప్పు చక్కెర, అరకప్పు నీళ్లు పోసి పాకం అయ్యేదాక మరిగించాలి. తరువాత కుంకుమ పువ్వు, యాలకలపొడి వేసి రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. వేరొక గిన్నెలో మీగడ, పాలపొడి వేసి చిన్నమంటపై అది ముద్దలా అయ్యేవరకు వేడి చేయాలి. నాలుగు నిమిషాల తరువాత బాదం, పిస్తా పలుకులు, యాలకలపొడి వేసి మిశ్రమంలోని నీరంతా ఆవిరయ్యాక స్టవ్ ఆపేయాలి. ముందుగా కలుపుకున్న పిండిని అప్పాల్లాగా చేసి మధ్యలో ఈ మిశ్రమం పెట్టి మళ్లీ దాన్ని ఉండలా చేసి నూనెలో వేగించాలి. అంతే.... వీటిపై పాకం వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







