హాయిగా నిద్రపట్టాలంటే.. ద్రాక్ష పండ్లు, పాలకూరను తినండి..
- November 18, 2016
ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఉండవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రాత్రి పూట హాయిగా నిద్రపోవాలంటే ద్రాక్ష పండ్లను తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లెవనాయిడ్స్ అధిక మొత్తంలో ఉన్నాయని.. తద్వారా గుండెపోటు, హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.
ఇకపోతే.. పాలకూరలో అధికంగా ఉండే పోటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే హాయిగా నిద్రపోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









