ఢిల్లీలో కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం

- November 19, 2016 , by Maagulf
ఢిల్లీలో కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం

పెళ్ళి కి వెళ్తోన్న ఓ మహిళలను రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. డిల్లీలో ఓ వివాహనికి వెళ్థుండగా రైలులోనే దుండగుడు ఆమెను దారుణంగా రేప్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ కు చెందిన ఓ మహిళ తమ బంధువల వివాహనికి డిల్లీ వెళ్ళేందుకు రైలులో ప్రయాణీస్తోంది. ఆమె మహిళల కోచ్ లో ప్రయాణిస్తోంది. అయితే ఈ కోచ్ లో ఐదుగురు మహిళలు ఉన్నారు.షాదారాలో రైల్వేస్టేషన్ లో నలుగురు మహిళలు రైలు దిగివెళ్ళిపోయారు. నలుగురు మహిళలు దిగిన వెంటనే ఆ బోగిలోకి ముగ్గురు దుండగులు వచ్చారు. ఆమె వద్ద ఉన్న బంగారం, వస్తువులు,నగదును దోచుకొన్నారు. ఇద్దరు పారిపోయారు. అయితే బోగిలో ఎవరూ లేకపోవడంతో ఇందులో ఒక్క దుండగుడు ఆమెపై అత్యాచారం చేశాడు.

లైంగిక దాడికి ఆమె సహకరించకపోవడంతో ఆమెపై ఆ దుండగుడు దాడి చేశాడు. అతని తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశాడు.దుండగుడిని రక్షించుకొనేందుకు ఆమె గట్టిగా అరిచింది. ఈ అరుపులు విన్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ణి షాబాజ్ గా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com