బాలీవుడ్ బాద్ షా కు తృటిలో తప్పిన ప్రమాదం
- November 19, 2016బాలీవుడ్ కింగ్ఖాన్ షారుక్కి తృటిలో ప్రమాదం తప్పింది. షారుక్.. ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'డియర్ జిందగీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో షారుక్కి జంటగా ఆలియా భట్ నటిస్తోంది. సినిమాలో షారుక్, ఆలియాలు సైకిల్పై గల్లీ రోడ్డులో చక్కర్లు కొట్టాల్సిన సన్నివేశం ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన సామాన్లతో పాటు చిత్రబృందం అంతా కలిసి ఆప్రదేశానికి ఓ టెంపోలో వచ్చారు. టెంపో ఆగిన చోటే షారుక్ సైకిల్ పక్కన నిల్చున్నాడు. అయితే టెంపో డ్రైవర్ చూసుకోకుండా బండి స్టార్ట్ చేయడంతో అది సైకిల్పైకి దూసుకెళ్లింది.
వెంటనే గమనించిన షారుక్ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దర్శకురాలు గౌరి, కెమెరామెన్ సైకిల్ సన్నివేశాన్ని గబగబా చిత్రీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు