బాలీవుడ్ బాద్ షా కు తృటిలో తప్పిన ప్రమాదం
- November 19, 2016
బాలీవుడ్ కింగ్ఖాన్ షారుక్కి తృటిలో ప్రమాదం తప్పింది. షారుక్.. ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'డియర్ జిందగీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో షారుక్కి జంటగా ఆలియా భట్ నటిస్తోంది. సినిమాలో షారుక్, ఆలియాలు సైకిల్పై గల్లీ రోడ్డులో చక్కర్లు కొట్టాల్సిన సన్నివేశం ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన సామాన్లతో పాటు చిత్రబృందం అంతా కలిసి ఆప్రదేశానికి ఓ టెంపోలో వచ్చారు. టెంపో ఆగిన చోటే షారుక్ సైకిల్ పక్కన నిల్చున్నాడు. అయితే టెంపో డ్రైవర్ చూసుకోకుండా బండి స్టార్ట్ చేయడంతో అది సైకిల్పైకి దూసుకెళ్లింది.
వెంటనే గమనించిన షారుక్ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దర్శకురాలు గౌరి, కెమెరామెన్ సైకిల్ సన్నివేశాన్ని గబగబా చిత్రీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







