బాలీవుడ్ బాద్ షా కు తృటిలో తప్పిన ప్రమాదం

- November 19, 2016 , by Maagulf
బాలీవుడ్ బాద్ షా కు తృటిలో తప్పిన ప్రమాదం

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. షారుక్‌.. ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'డియర్‌ జిందగీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో షారుక్‌కి జంటగా ఆలియా భట్‌ నటిస్తోంది. సినిమాలో షారుక్‌, ఆలియాలు సైకిల్‌పై గల్లీ రోడ్డులో చక్కర్లు కొట్టాల్సిన సన్నివేశం ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన సామాన్లతో పాటు చిత్రబృందం అంతా కలిసి ఆప్రదేశానికి ఓ టెంపోలో వచ్చారు. టెంపో ఆగిన చోటే షారుక్‌ సైకిల్‌ పక్కన నిల్చున్నాడు. అయితే టెంపో డ్రైవర్‌ చూసుకోకుండా బండి స్టార్ట్‌ చేయడంతో అది సైకిల్‌పైకి దూసుకెళ్లింది.

వెంటనే గమనించిన షారుక్‌ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దర్శకురాలు గౌరి, కెమెరామెన్‌ సైకిల్‌ సన్నివేశాన్ని గబగబా చిత్రీకరించినట్లు బాలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి. నవంబర్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com