బాలీవుడ్ బాద్ షా కు తృటిలో తప్పిన ప్రమాదం
- November 19, 2016
బాలీవుడ్ కింగ్ఖాన్ షారుక్కి తృటిలో ప్రమాదం తప్పింది. షారుక్.. ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'డియర్ జిందగీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో షారుక్కి జంటగా ఆలియా భట్ నటిస్తోంది. సినిమాలో షారుక్, ఆలియాలు సైకిల్పై గల్లీ రోడ్డులో చక్కర్లు కొట్టాల్సిన సన్నివేశం ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన సామాన్లతో పాటు చిత్రబృందం అంతా కలిసి ఆప్రదేశానికి ఓ టెంపోలో వచ్చారు. టెంపో ఆగిన చోటే షారుక్ సైకిల్ పక్కన నిల్చున్నాడు. అయితే టెంపో డ్రైవర్ చూసుకోకుండా బండి స్టార్ట్ చేయడంతో అది సైకిల్పైకి దూసుకెళ్లింది.
వెంటనే గమనించిన షారుక్ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దర్శకురాలు గౌరి, కెమెరామెన్ సైకిల్ సన్నివేశాన్ని గబగబా చిత్రీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









