విజయనగరం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
- November 19, 2016
ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లాలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు నవరంగపూర్ జిల్లా రాయ్గఢ్ నుంచి 25 మంది ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా రామభద్రాపురం బైపాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నవరంగపూర్ జిల్లా దాబూగర్కు చెందిన సెహీనా సుల్తాన్(45), షకీలా సుల్తాన్(48), అయాన్(3) అక్కడికక్కడే మృతిచెందారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







