విజయనగరం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

- November 19, 2016 , by Maagulf
విజయనగరం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లాలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు నవరంగపూర్‌ జిల్లా రాయ్‌గఢ్‌ నుంచి 25 మంది ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా రామభద్రాపురం బైపాస్‌ రోడ్డు వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నవరంగపూర్‌ జిల్లా దాబూగర్‌కు చెందిన సెహీనా సుల్తాన్‌(45), షకీలా సుల్తాన్‌(48), అయాన్‌(3) అక్కడికక్కడే మృతిచెందారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com