విజయనగరం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
- November 19, 2016
ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లాలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు నవరంగపూర్ జిల్లా రాయ్గఢ్ నుంచి 25 మంది ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా రామభద్రాపురం బైపాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నవరంగపూర్ జిల్లా దాబూగర్కు చెందిన సెహీనా సుల్తాన్(45), షకీలా సుల్తాన్(48), అయాన్(3) అక్కడికక్కడే మృతిచెందారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









