గోవాలో 'ఫిలిం ఫెస్టివల్' ప్రారంభం
- November 20, 2016
గోవాలోని పనాజీలో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. యూపీలో జరిగిన పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ ఘోర రైలు ప్రమాద మృతులకు కార్యక్రమ ప్రారంభోత్సవంలో నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమ ప్రాంగణమంతా దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించే విధంగా తయారు చేశారు. ఆవరణలో ఇరువైపు ఏర్పాటు చేసిన త్రీడీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ కళాకారుడు మరియా మిరండా ఈ త్రీడీ కటౌట్లను తయారుచేశారు.తొమ్మిది రోజుల పాటు సాగనున్న ఈ చిత్రోత్సవం ఈనెల 28న ముగియనుంది. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను అలరించేందుకు 21వ తేదీ నుంచి ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలకు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం ప్రదర్శించనున్నారు. సైరాట్, నటసామ్రాట్, మగధీర, బాజీరావ్ మస్తానీ, సుల్తాన్, ఎయిర్లిఫ్ట్, షోలే చిత్రాలను మిర్మర్ బీచ్ ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్ మీద ప్రదర్శిస్తారు.
దేశవిదేశాల నుంచి సినీ ఔత్సాహికులు ఈ చిత్రోత్సవానికి హాజరవుతారు. దాదాపు 90 దేశాలకు చెందిన 200 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









