అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి విజయం..
- November 21, 2016
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన కీలక స్థానిక ఎన్నికల్లో భారత సంతతి ముస్లిం మహిళ విజయభేరి మోగించింది. వలసదారుల వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత అత్యధికంగా ఉండే మేరీల్యాండ్ రాష్ట్రంలో 23 ఏళ్ల రహీలా అహ్మద్ అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. రహీలా తండ్రి భారత్కు చెందినవారు, కాగా తల్లి పాకిస్థాన్ మహిళ.మేరీల్యాండ్లోని ప్రిన్స్ జార్స్ కౌంటీ స్కూల్ బోర్డ్ ఎన్నికల్లో 15శాతం భారీ మెజారిటీతో సుదీర్ఘకాలం కొనసాగుతున్న సిస్టం అడ్మినిస్ట్రేటర్పై రహీలా విజయం సాధించింది. 2012లోనూ ఆమె ఈ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ విజయం సాధించలేదు. ఆమె కౌంటీలో 80శాతం ఆఫ్రికన్-అమెరికన్ సంతతి ఉన్నప్పటికీ ఈ అద్భుత విజయాన్ని సాధించడం గమనార్హం.ఆమెకు రిపబ్లికన్ నేషనల్ కమిటీ మాజీ చైర్మన్ మైఖేల్ స్టీల్ సైతం మద్దతు పలికారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సమయంలో హిజాబ్ ధరించి ముస్లిం మహిళ అయిన తాను గెలుపొందడం అమెరికాలో భిన్నత్వానికి తావు ఉందని చాటుతోందని, అమెరికా డ్రీమ్ ఇంకా సజీవంగానే ఉందని రహీలా అహ్మద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







