ఐదున్నర కోట్ల పెద్ద నోట్లతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ వ్యక్తి
- November 22, 2016
చార్టర్డ్ ఫ్లైట్లో రూ.5.5కోట్ల విలువైన పాతనోట్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని నాగాలాండ్ ఎయిర్పోర్ట్లో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్లోని ముంగర్కి చెందిన సింగ్ అనే వ్యాపారవేత్త ఈరోజు ఉదయం హరియాణాలోని సిర్సా ప్రాంతం నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో ఒంటరిగా నాగాలాండ్ వచ్చాడు. అయితే అతనిపై అనుమానం రావటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది విచారించగా డబ్బు ఉన్నట్లు వెల్లడించాడు. ఆ డబ్బు ఎవరిదీ అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద ఉన్నదంతా రద్దయిన పెద్ద నోట్లే అని, వాటి విలువ రూ.5.5కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఎయిర్పోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









