ఐదున్నర కోట్ల పెద్ద నోట్లతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ వ్యక్తి

- November 22, 2016 , by Maagulf
ఐదున్నర కోట్ల పెద్ద నోట్లతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ వ్యక్తి

చార్టర్డ్‌ ఫ్లైట్‌లో రూ.5.5కోట్ల విలువైన పాతనోట్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని నాగాలాండ్‌ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని ముంగర్‌కి చెందిన సింగ్‌ అనే వ్యాపారవేత్త ఈరోజు ఉదయం హరియాణాలోని సిర్సా ప్రాంతం నుంచి చార్టర్డ్‌ ఫ్లైట్‌లో ఒంటరిగా నాగాలాండ్‌ వచ్చాడు. అయితే అతనిపై అనుమానం రావటంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది విచారించగా డబ్బు ఉన్నట్లు వెల్లడించాడు. ఆ డబ్బు ఎవరిదీ అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద ఉన్నదంతా రద్దయిన పెద్ద నోట్లే అని, వాటి విలువ రూ.5.5కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com