ఐదున్నర కోట్ల పెద్ద నోట్లతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ వ్యక్తి
- November 22, 2016
చార్టర్డ్ ఫ్లైట్లో రూ.5.5కోట్ల విలువైన పాతనోట్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని నాగాలాండ్ ఎయిర్పోర్ట్లో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్లోని ముంగర్కి చెందిన సింగ్ అనే వ్యాపారవేత్త ఈరోజు ఉదయం హరియాణాలోని సిర్సా ప్రాంతం నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో ఒంటరిగా నాగాలాండ్ వచ్చాడు. అయితే అతనిపై అనుమానం రావటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది విచారించగా డబ్బు ఉన్నట్లు వెల్లడించాడు. ఆ డబ్బు ఎవరిదీ అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద ఉన్నదంతా రద్దయిన పెద్ద నోట్లే అని, వాటి విలువ రూ.5.5కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ఎయిర్పోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







