మూతపడ్డ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్
- November 22, 2016
తైవాన్ కు చెందిన తొలి ప్రైవేట్ విమానయాన రంగ సంస్థ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ మూతపడింది. భారీ ఆర్థిక నష్టాలు, ఇటీవల జరిగిన రెండు ప్రమాద ఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ట్రాన్స్ ఏసియా చైర్మన్ విన్సెంట్ లిన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నష్టాలను భరించే స్థితిలేదని, అదనంగా నిధులు సమకూరకపోవడంతో ట్రాన్స్ ఏసియాను మూసివేస్తున్నట్టు తెలిపారు.
1951లో ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ ను స్థాపించారు. చైనా, జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లోని పలు నగరాల మధ్య ఈ సర్వీసులను నడిపారు. 2014, 2015లో తైవాన్ లో ఈ సంస్థకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 92 మంది మరణించారు.
పైలట్ల తప్పిదాల వల్లే ప్రమాదాలు జరిగినట్టు విచారణలో తేలింది. దీనికి తోడు ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ట్రాన్స్ ఏసియా భారీగా నష్టాలు చవిచూసిందని, కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కంపెనీని మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామని విన్సెంట్ లిన్ మీడియా సమావేశంలో చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







