మూతపడ్డ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్
- November 22, 2016
తైవాన్ కు చెందిన తొలి ప్రైవేట్ విమానయాన రంగ సంస్థ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ మూతపడింది. భారీ ఆర్థిక నష్టాలు, ఇటీవల జరిగిన రెండు ప్రమాద ఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ట్రాన్స్ ఏసియా చైర్మన్ విన్సెంట్ లిన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నష్టాలను భరించే స్థితిలేదని, అదనంగా నిధులు సమకూరకపోవడంతో ట్రాన్స్ ఏసియాను మూసివేస్తున్నట్టు తెలిపారు.
1951లో ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ ను స్థాపించారు. చైనా, జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లోని పలు నగరాల మధ్య ఈ సర్వీసులను నడిపారు. 2014, 2015లో తైవాన్ లో ఈ సంస్థకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 92 మంది మరణించారు.
పైలట్ల తప్పిదాల వల్లే ప్రమాదాలు జరిగినట్టు విచారణలో తేలింది. దీనికి తోడు ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ట్రాన్స్ ఏసియా భారీగా నష్టాలు చవిచూసిందని, కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కంపెనీని మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామని విన్సెంట్ లిన్ మీడియా సమావేశంలో చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..









