పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం మరో సంచలన ప్రకటన

- November 22, 2016 , by Maagulf
పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం మరో సంచలన ప్రకటన

పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులను గ్రహించిన కేంద్రం ఊరట నిచ్చే ప్రకటన చేసింది. ఈ నెల 24 నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్‌లో డిబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈ నెల 24తో ముగియనున్న ఎయిర్ పోర్టులో ఉచిత పార్కింగ్ ను ఈ నెల 28 అర్థరాత్రి వరకు పొడిగించింది. ఐఆర్‌టీసీలో టికెట్ల బుకింగ్ సర్వీస్ ట్యాక్స్‌ను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాత రూ.1000, రూ.500 నోట్లు చిన్న మొత్తాల పొదుపులో డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే బ్యాంకు ఖాతాలేని వారు ఇతర ఖాతాదారుల లిఖితపూర్వక అనుమతితో జమ చేసే మొత్తాన్ని పది వేల నుంచి ఇరవై వేలకు ఆర్బీఐ పెంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com