ఆర్టీసీ త్వరలో కొత్త 'రాజధాని'బస్సులను తెలంగాణ రోడ్లపైకి....
- November 22, 2016
ఆర్టీసీ త్వరలో కొత్త 'రాజధాని'బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 61 రాజధాని (పూర్వపు పేరు ఇంద్ర) బస్సులు తిరుగుతున్నాయి. ఇవన్నీ పాతబడిపోవటంతో వాటి స్థానంలో కొత్తగా 95 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిని సమకూర్చుకునే ప్రక్రియ దాదాపుగా పూర్తి అవుతున్నందున త్వరలో వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.సూపర్ లగ్జరీ కంటే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ సౌకర్యాల పరంగా మెరుగ్గా ఉండటంతో రాజధాని బస్సులకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులు నడపాలని సీఎం కూడా ఆదేశించటంతో వాటి సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు.డిమాండ్ ఉన్న దూరపు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. సూపర్ లగ్జరీలుగా పాత బస్సులు... పాత రాజధాని బస్సులను సూపర్లగ్జరీ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. వాటికి కొత్త బాడీ అమర్చి కొత్త రూపుతో రోడ్లపైకి తేనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







