రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
- November 22, 2016రోడ్డు ప్రమాదంలో విజిబిలిటీ కారణంగా 25 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అబుదాబీ పోలీస్ జనరల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అలి ఖల్ఫాన్ అల్ ధాధెరి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడ్డవారిని తవామ్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందించిన వెంటనే, ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. అక్కడికక్కడే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్నవారిని అల్ అయిన్లోని తవామ్ ఆసుపత్రికి తరలించారు. లో విజిబిలిటీ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనదారులు పరిస్థితులకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సి ఉంటుందనీ, లో విజిబిలిటీ ఉన్నప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలనీ, తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని, ముందు వెళ్ళే వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..