రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
- November 22, 2016
రోడ్డు ప్రమాదంలో విజిబిలిటీ కారణంగా 25 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అబుదాబీ పోలీస్ జనరల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అలి ఖల్ఫాన్ అల్ ధాధెరి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడ్డవారిని తవామ్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందించిన వెంటనే, ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. అక్కడికక్కడే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్నవారిని అల్ అయిన్లోని తవామ్ ఆసుపత్రికి తరలించారు. లో విజిబిలిటీ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనదారులు పరిస్థితులకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సి ఉంటుందనీ, లో విజిబిలిటీ ఉన్నప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలనీ, తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని, ముందు వెళ్ళే వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









