ఆర్మీ హెలికాప్టర్ అదృశ్యం

- November 24, 2016 , by Maagulf
ఆర్మీ హెలికాప్టర్ అదృశ్యం

ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న ఇండోనేసియా ఆర్మీ హెలికాప్టర్ గురువారం బోర్నియా ద్వీపం మీదుగా వెళ్తూ అదృశ్యమైంది. ఉత్తర కాలిమంతన్ ప్రావిన్స్‌లోని తరకాన్ నుంచి మలేసియా సరిహద్దులోని లాంగ్ బవాన్‌కు ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న బెల్ 412 హెలికాప్టర్ అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ అదృశ్యమైనట్టు భావిస్తున్న ప్రాంతానికి సహాయక సిబ్బందిని పంపినట్టు రెస్క్యూ చీఫ్ ముజియోనో తెలిపారు. ఇండోనేసియాలో గత కొన్నేళ్లుగా విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జూన్ 215లో ఎయిర్ ఫోర్స్ విమానం హెర్క్యులస్ సీ-130 కూలిపోయిన ఘటనలో 142 మంది దుర్మరణం పాలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com