ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఇప్పుడు ఢిల్లీలో
- November 24, 2016
అంతర్జాతీయ మైనం మ్యూజియంగా పేరు పొంది ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకునే మేడమ్ టుస్సాడ్స్ శాఖను త్వరలో దేశరాజధాని దిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. టుస్సాడ్స్ మ్యూజియం శాఖలు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్నాయి. దిల్లీలో తన 22వ మ్యూజియాన్ని ప్రారంభించనుంది. 2017 మధ్య నాటికి కన్నాట్ ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన వారి మైనం విగ్రహాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ తెందుల్కర్, కిమ్ కర్దాషియన్, అమితాబ్ బచ్చన్ తదితరుల విగ్రహాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్లోని డోర్సెట్ ప్రధాన కేంద్రంగా మెర్లిన్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని నిర్వహిస్తోంది.
లండన్లో ఉన్న మైనం మ్యూజియంలో భారతీయ ప్రముఖులు ప్రధాని నరేంద్రమోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రతిమలు కొలువుదీరాయి. లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో తొలిసారిగా బాలీవుడ్ నటుడు అమితాబ్ ప్రతిమను 2000లో ఏర్పాటు చేసినట్లు మెర్లిన్ ఎంటర్టైన్మెంట్ చీఫ్ న్యూ ఓపెనింగ్స్ ఆఫీసర్ జాన్ జాకోబ్సేన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









