ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఇప్పుడు ఢిల్లీలో
- November 24, 2016
అంతర్జాతీయ మైనం మ్యూజియంగా పేరు పొంది ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకునే మేడమ్ టుస్సాడ్స్ శాఖను త్వరలో దేశరాజధాని దిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. టుస్సాడ్స్ మ్యూజియం శాఖలు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్నాయి. దిల్లీలో తన 22వ మ్యూజియాన్ని ప్రారంభించనుంది. 2017 మధ్య నాటికి కన్నాట్ ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన వారి మైనం విగ్రహాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ తెందుల్కర్, కిమ్ కర్దాషియన్, అమితాబ్ బచ్చన్ తదితరుల విగ్రహాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్లోని డోర్సెట్ ప్రధాన కేంద్రంగా మెర్లిన్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని నిర్వహిస్తోంది.
లండన్లో ఉన్న మైనం మ్యూజియంలో భారతీయ ప్రముఖులు ప్రధాని నరేంద్రమోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రతిమలు కొలువుదీరాయి. లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో తొలిసారిగా బాలీవుడ్ నటుడు అమితాబ్ ప్రతిమను 2000లో ఏర్పాటు చేసినట్లు మెర్లిన్ ఎంటర్టైన్మెంట్ చీఫ్ న్యూ ఓపెనింగ్స్ ఆఫీసర్ జాన్ జాకోబ్సేన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







