ఫిలిప్పీన్స్లో భారత జంట కాల్చివేసిన దుండగులు
- November 24, 2016
భారత్కు చెందిన ఓ సిక్కుజంట ఫిలిప్పీన్స్లో కాల్చివేతకు గురైంది. కేమరిన్స్ సర్ ప్రావిన్స్లోని సిపోకోట్ పట్టణానికి చెందిన భగవంత్ సింగ్ బుట్టర్(45), అతడి భార్య జస్విందర్ కౌర్(36)ను రెండు బైక్లపై వచ్చిన దుండగులు ఈరోజు కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న మార్విన్ మగ్డావోంగ్ రోడొల్ఫోలను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతులను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. రెండు పిస్టళ్లు, మందుగుండును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఫిలిప్పీన్స్లో గతంలోనూ పలువురు భారతీయులపై దాడులు జరిగాయి. చివరిగా ఈ ఏడాది ఆగస్టులో పంజాబ్లోని ఫగ్వారాకు చెందిన 26 ఏళ్ల యువకుడిని శాంటియాగోలో దుండగులు కాల్చి చంపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









