ఫిలిప్పీన్స్లో భారత జంట కాల్చివేసిన దుండగులు
- November 24, 2016
భారత్కు చెందిన ఓ సిక్కుజంట ఫిలిప్పీన్స్లో కాల్చివేతకు గురైంది. కేమరిన్స్ సర్ ప్రావిన్స్లోని సిపోకోట్ పట్టణానికి చెందిన భగవంత్ సింగ్ బుట్టర్(45), అతడి భార్య జస్విందర్ కౌర్(36)ను రెండు బైక్లపై వచ్చిన దుండగులు ఈరోజు కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న మార్విన్ మగ్డావోంగ్ రోడొల్ఫోలను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతులను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. రెండు పిస్టళ్లు, మందుగుండును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఫిలిప్పీన్స్లో గతంలోనూ పలువురు భారతీయులపై దాడులు జరిగాయి. చివరిగా ఈ ఏడాది ఆగస్టులో పంజాబ్లోని ఫగ్వారాకు చెందిన 26 ఏళ్ల యువకుడిని శాంటియాగోలో దుండగులు కాల్చి చంపారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







