పంజాబ్లోని బఠిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
- November 25, 2016
పంజాబ్లోని బఠిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల వికాసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ప్రధాని.. రహదారులు, విమానాశ్రయాలు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలు గల పాఠశాలలు ఆస్పత్రులు మనకు అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాదని.. తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఏ దైశమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు కల్పనే ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా లక్షితదాడుల్లో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు.పాకిస్థాన్లోని పెషావర్లో దాడి జరిగితే భారతీయులంతా బాధ పడతారని చెప్పారు. అవినీతి, నకిలీనోట్లుపై పోరాడాలని ప్రజలు వారి పాలకులకు చెప్పాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







