పంజాబ్లోని బఠిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
- November 25, 2016
పంజాబ్లోని బఠిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల వికాసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ప్రధాని.. రహదారులు, విమానాశ్రయాలు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలు గల పాఠశాలలు ఆస్పత్రులు మనకు అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాదని.. తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఏ దైశమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు కల్పనే ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా లక్షితదాడుల్లో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు.పాకిస్థాన్లోని పెషావర్లో దాడి జరిగితే భారతీయులంతా బాధ పడతారని చెప్పారు. అవినీతి, నకిలీనోట్లుపై పోరాడాలని ప్రజలు వారి పాలకులకు చెప్పాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







