కేసీఆర్తో ప్రధాని ప్రత్యేక భేటీ
- November 25, 2016
రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడినుంచి బయల్దేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లాల్సి ఉండగా.. అలా వెళ్లేందుకు ముందు పది నిమిషాలు ప్రత్యేకంగా వారిద్దరితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
ఆ భేటీ ముగిసిన తర్వాత మాత్రమే మోదీ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం మాత్రం తెలియరాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి పెద్దనోట్ల రద్దు తదితర అంశాలపై ఆయనకు సవివరంగా చెప్పిన విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఆ విషయాలపైనే చర్చించారా.. లేక వేరే ఏవైనా అంశాలు చర్చకు వచ్చాయా అన్న సంగతి మాత్రం తెలియలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







