కేసీఆర్తో ప్రధాని ప్రత్యేక భేటీ
- November 25, 2016
రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడినుంచి బయల్దేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లాల్సి ఉండగా.. అలా వెళ్లేందుకు ముందు పది నిమిషాలు ప్రత్యేకంగా వారిద్దరితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
ఆ భేటీ ముగిసిన తర్వాత మాత్రమే మోదీ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం మాత్రం తెలియరాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి పెద్దనోట్ల రద్దు తదితర అంశాలపై ఆయనకు సవివరంగా చెప్పిన విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఆ విషయాలపైనే చర్చించారా.. లేక వేరే ఏవైనా అంశాలు చర్చకు వచ్చాయా అన్న సంగతి మాత్రం తెలియలేదు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









