కేసీఆర్‌తో ప్రధాని ప్రత్యేక భేటీ

- November 25, 2016 , by Maagulf
కేసీఆర్‌తో ప్రధాని ప్రత్యేక భేటీ

రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడినుంచి బయల్దేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లాల్సి ఉండగా.. అలా వెళ్లేందుకు ముందు పది నిమిషాలు ప్రత్యేకంగా వారిద్దరితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
ఆ భేటీ ముగిసిన తర్వాత మాత్రమే మోదీ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం మాత్రం తెలియరాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి పెద్దనోట్ల రద్దు తదితర అంశాలపై ఆయనకు సవివరంగా చెప్పిన విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఆ విషయాలపైనే చర్చించారా.. లేక వేరే ఏవైనా అంశాలు చర్చకు వచ్చాయా అన్న సంగతి మాత్రం తెలియలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com