గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం
- November 26, 2016
గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ న్యూ దిల్లీ, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాయం వారు సంయుక్తంగా గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం(సర్వే)కు శ్రీకారం చుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్(చరిత్ర) అడపా సత్యనారాయణ, ప్రవాసీ మిత్ర సంస్థ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చి స్కాలర్ జి.సాయిక్రిష్ణ యాదవ్(గల్ఫ్ వలసలు) ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశమై గల్ఫ్ బాధితుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రవాసి మిత్ర సంస్థ అధ్యక్షుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వయసుల వారిగా ప్రజలు ఎడారి దేశాలకు వలసవెళ్లడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అన్నారు. గల్ఫ్లో వారు పడిని ఇబ్బందులు, వేతనలేమి, ఏజెంట్ల మోసాలు తదితర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తామని అన్నారు. ఇందులో భాగంగా వెంకటాపూర్ను నమూనా గ్రామంగా ఎంపిక చేసుకున్నామన్నారు. త్వరలో బృందాలు ఇంటింటా సర్వే నిర్వహించి గల్ఫ్ బాధితులపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వాలకు అందజేస్తామని భీంరెడ్డి పేర్కొన్నారు. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వలసలు, ఎడారి దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్లడానికి గల కారణాలను జడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య, మంత్రి కె.తారకరామారావు వ్యక్తిగత సహాయకుడు గనరాజు బృందానికి వివరించారు. సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
--సాయి కృష్ణ యాదవ్

తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









