వచ్చే ఏడాది దీపావళికి '2.0' విడుదల...

- November 29, 2016 , by Maagulf
వచ్చే ఏడాది దీపావళికి  '2.0'  విడుదల...

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' అనే సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రోబోకి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే 90%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా పోర్షన్ జనవరికల్లా పూర్తవుతుందట.దీంతో జనవరి నెలాఖరు నుంచి అక్టోబర్ వరకూ సుమారు 8-9 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌పైనే శంకర్ పనిచేయనున్నారు. ముఖ్యంగా ఈ సినిమా 3డీలో విడుదల కానుండడంతో అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. పలువురు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com