292 మంది ఖైదీల విడుదలకు షేక్‌ మొహమ్మద్‌ ఆదేశం

- November 30, 2016 , by Maagulf
292 మంది ఖైదీల విడుదలకు షేక్‌ మొహమ్మద్‌ ఆదేశం

దుబాయ్‌ రూలర్‌, యూఏఈ వైఎస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, 292 మంది ఖైదీల విడుదలకు ఆదేశించారు. యూఏఈ 45వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దుబాయ్‌ అటార్నీ జనరల్‌ ఎస్సామ్‌ ఐసా అల్‌ హుమైదాన్‌ మాట్లాడుతూ, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ దుబాయ్‌ పోలీస్‌తో ఈ విషయమై చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. షేక్‌ మొహమ్మద్‌ క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందనీ, ఖైదీలుగా ఇప్పటిదాకా జీవితం గడిపినవారు, క్షమాభిక్ష తర్వాత సమాజంలోకి వచ్చి మంచి పౌరులుగా జీవించాలనీ, దేశాభివృద్ధిలో కలిసి పనిచేయాలని అల్‌ హుమైదాన్‌ కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com