గూగుల్ యాజమాన్యంపై దుమారం
- September 01, 2015
గూగుల్ సంస్థ తమ కంపెనీల విషయాలను తక్కువ చేసి చూపుతుందని అమెరికా, యూరప్ ఖండాలలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అదేవిధంగా భారత్ లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయిని పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం ఆ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు వివరణ కోరింది. కంపెనీల మధ్య నెలకొన్న కాంపిటీషన్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. కంపెనీల ఆర్థిక లావాదేవిలు, ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్, సేవల వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెజిల్, మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువ చేసి చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఇదేతరహాలో భారత వెబ్ సైట్ భారత్ మాట్రిమోని, కన్స్యూమర్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేయడంతో తమ సైట్ల సేవలు కాస్త నెమ్మదించాయని, ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లోపు వివరణ ఇచ్చుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థ నిర్వాహకులకు సూచించగా, గడువును మరింత పొడిగించాలని గూగుల్ కోరుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







