వెబ్సైట్ బ్లాక్పై అభియోగాలు
- December 01, 2016
దోహా: ఖతార్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, గల్ఫ్ స్టేట్కి సంబంధించిన ప్రముఖ ఇంగ్లీష్ న్యూష్ వెబ్సైట్ని బ్లాక్ చేసినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. దుబాయ్ న్యూస్, గత ఏడాదిలో పలు ఆర్టికల్స్ ప్రచారంలోకి తీసుకురాగా అవి ఖతార్ అధికారిక వర్గాలకు అభ్యంతరంగా కన్పించడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలనుంచీ వెబ్సైట్ బ్లాక్ అయ్యిందని దోహా న్యూస్ వార్గలు వెల్లడించాయి. తమ వెబ్సైట్కి నెలకు మిలియన్ పాఠకులు ఉన్నారనీ ఆ సంస్థ చెబుతోంది. మీడియా ఫ్రీడమ్ని అడ్డుకునే ఇలాంటి చర్యల పట్ల తాము అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.మొబైల్ ఫోన్లలోనూ, కంప్యూటర్లలోనూ ఈ వెబ్సైట్ బ్లాక్ అయ్యింది. ఇదే వెబ్సైట్ ఇంకో డొమైన్ నేమ్ని తమ రీడర్స్ కోసం రూపొందించినా, దాన్ని కూడా బ్లాక్ చేశారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఖతార్ సైబర్ క్రైమ్ చట్టంపై రెండు నెలల క్రితం దోహా న్యూస్ తెరపైకి తెచ్చిన కథనం ఈ వివాదానికి కారణంగా భావిస్తున్నారు. అలాగే గడచిన సమ్మర్లో ఖతారీ గే మ్యాన్ రాసిన కథనాన్ని కూడా ఈ సంస్థ ప్రచురించింది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







