జయ ఆరోగ్యంపై వచ్చిన రుమర్స్ అవాస్తవం: అపోలో హాస్పిటల్స్
- December 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో చెన్నై అట్టుడికిపోయింది. జయలలిత కన్నుమూశారంటూ కథనాలు రావడంతో తమిళనాడు ఒక్కసారిగా వేడెక్కింది. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిపైకి అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ విధ్వంసాలకు పూనుకున్నారు. ఆస్పత్రిపైకి రాళ్లతో విరుచుకుపడ్డారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జాతీయ మీడియా సంస్థలు సైతం జయలలిత కన్నుమూశారని కథనాలు ఇవ్వడంతో ఏం జరుగుతున్నదో అర్థం కాక చెన్నై నగరం కుతకుతలాడింది.
అయితే, ఈ కథనాలను, వదంతులను అపోలో ఆస్పజయ ఆరోగ్యంపై వచ్చిన రుమర్స్ అవాస్తవం: అపోలో హాస్పిటల్స్త్రి కొట్టిపారేసింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని, ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. జయలలిత ఆరోగ్యంపై తాము అధికారికంగా ఏమీ చెప్పకముందే ఆమె గురించి వదంతులు వచ్చినట్టు స్పష్టంచేసింది. అపోలో, ఎయిమ్స్కు చెందిన పెద్ద వైద్యబృందం అమ్మకు లైఫ్ సేవింగ్ చికిత్స కొనసాగిస్తున్నదని అపోలో ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- ఖతార్లో వ్యాపార ప్రారంభానికి ప్రత్యేక సహాయ కేంద్రం..!!
- యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..







