జయలలిత ఆరోగ్యంపై ఆరాతీస్తున్న వెంకయ్య నాయుడు
- December 05, 2016
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్, అపోలో వైద్యులు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడి జయ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం.
జయలలిత ఇక లేరని తమిళ మీడియాలో వచ్చిన ప్రకటనల్ని అపోలో ఆస్పత్రి కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణలో ఉన్న అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.ఆస్పత్రిపైనా, అక్కడి అధికారుల వాహనాలను సైతం వారు ధ్వంసం చేశారు. తమ 'అమ్మ' ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ రోదిస్తున్నారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని కట్టడిచేశారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- ఖతార్లో వ్యాపార ప్రారంభానికి ప్రత్యేక సహాయ కేంద్రం..!!
- యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..







