సెల్వరాజ్ ఇంటికి చేరుకున్నాడు...
- December 06, 2016
పనికోసం దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి తిరిగి రాలేక నరకయాతన అనుభవించిన తమిళనాడుకు చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ మంగళవారం తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దుబాయ్ నుంచి వచ్చేందుకు చేతిలో డబ్బులు లేక టికెట్ కొనివ్వండంటూ సెల్వరాజ్ అక్కడి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం 22 కి.మీ. దూరం నడిచి కోర్టుకు హాజరయ్యేవాడు. అలా అతడు సంవత్సర కాలంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు నడిచాడు. విదేశంలో పలు కష్టాలు అనుభవిస్తున్న సెల్వరాజ్ గురించి ఓ సామాజిక కార్యకర్త కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తెచ్చారు.
ఆమె దుబాయ్లో ఉన్న భారత దౌత్య అధికారులతో మాట్లాడి సెల్వరాజ్ను భారత్ తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అలా ఎట్టకేలకు కేంద్ర మంత్రి సహాయం ద్వారా సెల్వరాజ్ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నందుకు కుటుంబసభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. విదేశాల్లో చిక్కుకొని ఉన్న భారతీయుడిని రక్షించి మరోసారి మంత్రి సుష్మ తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







