డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక....
- December 08, 2016త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డోనాల్డ్ ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. టైం మ్యాగజైన్ ఈయనను ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎంపిక చేసింది. పోటీలో నిలచిన 10 మంది ఫైనలిస్టులను దాటి ట్రంప్ టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ రన్నరప్ గా నిలిచారు. ట్రంప్ గతంలో కూడా ఈ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
గత ఏడాది జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ ఈ హోదా దక్కించుకోగా, ట్రంప్ రన్నరప్ గా నిలిచాడు. అటు ప్రధాని మోదీ టైమ్ ఎంపిక చేసిన..11 మందితో కూడిన తుది లిస్టు లో ఘన విజయం సాధించారు. భారత ఓటర్లతో బాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ లలోని ఎన్నారైలు మోదీకే మా ఓటు అన్నారు.వార్తలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులకోసం ఈ మ్యాగజైన్ పోల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!