చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది

- December 09, 2016 , by Maagulf
చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది

టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద రూ.90 కోట్లు బయటపడిన వైనం మరువక ముందే... చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది. ఆదాయపన్నుఅధికారులు శుక్రవారం పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.106 కోట్ల నగదుతో పాటు 127 కేజీల బంగారం పట్టుబడింది. ఇందులో రూ.10 కోట్ల మేర కొత్త నోట్లు కూడా ఉండడం విశేషం. ఒక్కోటి కిలో బరువున్న 127 బంగారపు కడ్డీలు, రూ.96 కోట్ల పాత కరెన్సీ నోట్లు, రూ.10 కోట్ల మేర రూ.2000 కొత్తనోట్లు తమ సోదాల్లో బయటపడినట్టు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఆదాయపన్ను అధికారులకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం ఇదే తొలిసారి. శేఖర్ రెడ్డి సహా మరికొందరి కార్యకలాపాలపై నిఘా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది.కాగా పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్‌గా ఏర్పడినట్టు సమాచారం రావడంతో అధికారులు మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com