దుబాయ్ లో టాక్సీ డ్రైవర్లపై నిఘా కెమెరాల నీడ
- December 09, 2016
దుబాయ్: త్వరలో దుబాయ్ లో టాక్సీ డ్రైవర్లు అందరూ నిఘా కెమెరాలు నీడలో జాగ్రత్తగా మెలగాల్సిఉంది .ఈ కెమెరాల పరిశీలనలలో టాక్సీ డ్రైవర్లు తమ తమ ప్రవర్తన విషయంలోనూ అలాగే వారి అలసట స్థాయిలను సైతం పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ఉన్నతాధికారి తెలిపిన అధికారిక వివరాల ప్రకారం, దుబాయ్ లో ఉన్న 9,500 టాక్సీలలో ప్రత్యేక కెమెరాలను అమర్చడం వివిధ దశలలో అమర్చనున్నారు. ఈ పథకం మొత్తం 2018 ప్రారంభంలో పూర్తి చేయబడుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ఆర్.టి.ఎ కొన్ని టాక్సీలు ఎంపిక చేసి ఆ బ్యాచ్ టాక్సీలకు ఈ నిఘా కెమెరాలు అమర్చనున్నారు "మేము కెమెరాల ద్వారా ప్రయోగాత్మక ప్రక్రియను విజయవంతంగా పూర్తి ఆయావహాబీని మరియు కార్యాచరణ సామర్ధ్యాలపై ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మేము ఈ ఏడాది తరువాతి సంవత్సరం పలు దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. టాక్సీ లలో కెమెరాల యొక్క ఏర్పాటు ప్రారంభించడానికి అన్ని ఫ్రాంఛైజ్లు తో చర్చలు జరుపుతున్నట్లు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వద్ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఆడెల్ షాకేరి తెలిపారు.ఆసక్తికరంగా మరో ముఖ్య విషయమేమిటంటే ఈ నిఘా వ్యవస్థ ద్వారా ఏ ఒక్క ప్రయాణికుని గోప్యతను రక్షించడానికే దోహదపడుతుందన్నారు. నిఘా వ్యవస్థలో మూడు చిన్న కెమెరాలు టాక్సీ లో అమర్చుతారు.రెండు కెమెరాలు బాహ్యంగా టాక్సీ ముందు మరియు వెనుక ఏర్పాటు చేస్తారు , ఒక వాహనాలు, డ్రైవర్ కనబడేలా కేంద్ర అద్దం దగ్గర ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు ఏ ఒక్క ప్రయాణీకులను కనబడనీయవని షాకేరి చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







