మానవ హక్కుల పరిరక్షణకు జాయింట్ యాక్షన్ అవసరం
- December 10, 2016
మనామా: మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చి, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సి ఉందనీ, అలా జరిగినప్పుడే శాంతియుత జీవనం ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుందని ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ప్రిన్స్ ఖలీఫా ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్టాండ్ అప్ ఫర్ సమ్వన్స్ హ్యూమన్ రైట్స్ టుడే' అనే థీమ్ని మరింతగా ప్రాచుర్యంలోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో బహ్రెయిన్ ఎంతో శ్రమిస్తోందనీ, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారాయన. అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ విభాగంలో పనిచేయడానికి బహ్రెయిన్ ఎప్పుడూ ముందుంటుందని ప్రిన్స్ ఖలీఫా తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఐక్యరాజ్య సమితి చేపడ్తున్న చర్యల్ని ప్రిన్స్ ఖలీఫా అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







