శంషాబాద్‌ విమానాశ్రయంలో ఒమన్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌..

- December 12, 2016 , by Maagulf
శంషాబాద్‌  విమానాశ్రయంలో ఒమన్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒమన్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది. ఈ విమానం మస్కట్‌ నుంచి చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మరోవైపు కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలోని 148 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com