ఒమన్, ఇండియా మధ్య వీక్లీ ఎయిర్లైన్ సీట్ కోటా ఒప్పందం
- December 14, 2016
ఇండియన్ సెక్టార్ నుంచి ఒమన్ ఎదురుచూస్తోన్న ఎయిర్లైన్ సీట్స్ కోటాకి సంబంధించి తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ యావియేషన్ (పిఎసిఎ), ఇండియాతో చేసుకున్న ఒప్పందం ద్వారా వారానికి సీట్ల కోటా సంఖ్య 6,260గా ఉంటుంది. ఇంటర్నేషనల్ సివిల్ యావియేషన్ ఆర్గనైజేషన్ (ఐఎసిఓ) తొమ్మిదవ ఎయిర్ సర్వీసెస్ నెగోసియేషన్స్ ఈవెంట్లో పాల్గొంది. డిసెంబర్ 5 నుంచి 9 వరకు జరిగిన ఈ ఈవెంట్లో సౌదీ అరేబియా, కెన్యా, టాంజానియా, ఘనా, బహమాస్, కరాకావోలతోపాటు ఇండియాతోనూ ఎయిర్ కనెక్టివిటీని పెంచుకునేందుకు పలు ఒప్పందాలు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మరియు సలాలా ఎయిర్పోర్ట్ మధ్య ఎన్ని కార్గో విమానాలు అయినా తిరిగేందుకు వీలుగా ఓ ఒప్పందం ఆస్ట్రేలియాతో కుదుర్చుకుంది ఒమన్. ఈ ఒప్పందాలు, ఒమన్కీ ఇతర దేశాలకీ మధ్య సన్నిహిత సంబంధాల్ని ఇంకా పెంచుతాయని పిఎసిఎ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ చెప్పారు. ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంతో వీక్లీ సీట్ల కోటా సంఖ్య 27,405కి పెరుగుతుంది. అలాగే జెడ్డాకి వారానికి ఏడు అదనపు విమానాల్ని నడిపేందుకు ఒప్పందం కుదిరింది. ఘనాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య 14 వీక్లీ విమానాలు అదనంగా వచ్చి చేరతాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







