ఒమన్‌, ఇండియా మధ్య వీక్లీ ఎయిర్‌లైన్‌ సీట్‌ కోటా ఒప్పందం

- December 14, 2016 , by Maagulf
ఒమన్‌, ఇండియా మధ్య వీక్లీ ఎయిర్‌లైన్‌ సీట్‌ కోటా ఒప్పందం

ఇండియన్‌ సెక్టార్‌ నుంచి ఒమన్‌ ఎదురుచూస్తోన్న ఎయిర్‌లైన్‌ సీట్స్‌ కోటాకి సంబంధించి తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ యావియేషన్‌ (పిఎసిఎ), ఇండియాతో చేసుకున్న ఒప్పందం ద్వారా వారానికి సీట్ల కోటా సంఖ్య 6,260గా ఉంటుంది. ఇంటర్నేషనల్‌ సివిల్‌ యావియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎసిఓ) తొమ్మిదవ ఎయిర్‌ సర్వీసెస్‌ నెగోసియేషన్స్‌ ఈవెంట్‌లో పాల్గొంది. డిసెంబర్‌ 5 నుంచి 9 వరకు జరిగిన ఈ ఈవెంట్‌లో సౌదీ అరేబియా, కెన్యా, టాంజానియా, ఘనా, బహమాస్‌, కరాకావోలతోపాటు ఇండియాతోనూ ఎయిర్‌ కనెక్టివిటీని పెంచుకునేందుకు పలు ఒప్పందాలు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ మరియు సలాలా ఎయిర్‌పోర్ట్‌ మధ్య ఎన్ని కార్గో విమానాలు అయినా తిరిగేందుకు వీలుగా ఓ ఒప్పందం ఆస్ట్రేలియాతో కుదుర్చుకుంది ఒమన్‌. ఈ ఒప్పందాలు, ఒమన్‌కీ ఇతర దేశాలకీ మధ్య సన్నిహిత సంబంధాల్ని ఇంకా పెంచుతాయని పిఎసిఎ సిఇఓ డాక్టర్‌ మొహమ్మద్‌ బిన్‌ నాజర్‌ చెప్పారు. ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంతో వీక్లీ సీట్ల కోటా సంఖ్య 27,405కి పెరుగుతుంది. అలాగే జెడ్డాకి వారానికి ఏడు అదనపు విమానాల్ని నడిపేందుకు ఒప్పందం కుదిరింది. ఘనాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య 14 వీక్లీ విమానాలు అదనంగా వచ్చి చేరతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com