'ఓం నమో వెంకటేశాయ' లో ప్రతినాయకుడిగా జగపతి బాబు
- December 14, 2016
ఫ్యామిలీ హీరో ట్యాగ్ ని తగిలించుకొని కొన్నాళ్ళు తన హవాని నడిపించిన జగపతి బాబు ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబుకి ప్రస్తుతం కాల్షీట్స్ ఏ మాత్రం ఖాళీగా లేవు. మరి అంతగా బిజీ అయ్యాడు అప్పటి హీరో. కేవలం తెలుగు సినిమాలలోనే కాదు తమిళం, కన్నడ భాషలలోను జగపతి బాబు హవా నడుస్తోంది. ఇక ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తోన్న భక్తి రస చిత్రంలోను జగపతి బాబు ఓ కామియో రోల్ పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కృష్ణమ్మ భక్తురాలు అనుష్క పై మనసుపడే మహరాజు పాత్రలో జగపతి బాబు నటించనున్నాడని చెబుతున్నారు. మహారాజు పాత్రలో జగపతి బాబు చాలా గొప్పగా కనిపించనున్నాడని చెబుతున్నారు.
ఇప్పటికే జగపతి బాబు, అనుష్క లపై ఓ సాంగ్ ని కూడా చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. హథీరాం బాబా జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా కనిపించనుండగా.. విమలా రామన్, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







