విడాకులు తీసుకుంటున్న మీరా జాస్మిన్
- December 14, 2016
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఉన్నారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే అన్యోన్యంగా జీవిస్తున్నారు. చాలా మంది వరకు మద్యలోనే విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ మద్య ప్రేమ వివాహం చేసుకున్న మళియాల బ్యూటీ అమలాపాల్ సంవత్సరంలోపే విడాకులు తీసుకున్నారు. ఇక తెలుగులో తమిళ డబ్బింగ్ చిత్రం 'రన్' తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. తర్వాత పవన్ కళ్యాన్ తో 'గుడుంబ శంకర్', రవితేజ సరసన 'భద్ర' చిత్రాలతో అచ్చం తెలుగింటి అమ్మాయిగా అభిమానుల మనసు గెలుచుకుంది.
ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా విజయాలు సాధించలేదు. 2014లో అనూహ్యంగా దుబాయ్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ను పెళ్లాడి కొంత కాలం దుబాయ్ లో భర్తతో కాపురం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
భర్తతో ఏడాది పాటు విభేదాలు తలెత్తడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్న మీరా దుబాయ్ లో సెటిల్ అయ్యింది.. ఇటీవల 'పతూ కల్పనకల్' అనే చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ మద్య మీడియాతో మాట్లాడిన మీరా జాస్మిన్ తన నిర్ణయాల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వందశాతం సంతోషంగా ఉన్నానని మీరా జాస్మిన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







