కొర్రల పాయసం
- December 14, 2016
కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, శనగపప్పు - పావు కప్పు, పాలు - అర లీటరు, పచ్చి కర్జూరం - 1 కప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, తేనె - ఒక టీ స్పూను, నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కొన్ని నీళ్లు చిలకరించి కర్జూరాన్ని పేస్టులా చేసుకుని పక్కనుంచాలి. కొర్రల్ని దోరగా వేగించి, శనగపప్పుతో పాటు 3 కప్పులు నీరు పోసి 3 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, కర్జూరం పేస్టు కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకు ఉంచాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నేతిలో వేగించిన జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించి, యాలకుల పొడి, తేనె చల్లి వేడి వేడిగా తినాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









